అక్టోబర్ 17, 2020

పరిశ్రమలో డైరెక్టర్ గా కొనసాగడానికి ఏమి చెయ్యాలి

 సినిమా రంగం అంటే అందరికీ తెలిసిన రంగం. చిన్నప్పటి నుంచి ఎంతోమంది సినిమా నిర్మాతలు అవ్వాలి.డైరెక్టర్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ ప్రయాణంలో కొంతమంది సినిమాలో డైరెక్టర్ అవ్వవచ్చు, కొంతమంది అవ్వకపోవచ్చు. అయితే ఇప్పుడు పరిశ్రమ గురించి చూద్దాం ఎలా ఉంటుందో. నైపుణ్యాలు ఉన్న వ్యక్తిని ఏ పరిశ్రమ కూడా వదులుకోలేదు. వచ్చిన అవకాశాన్ని ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైనా తెలిసిన డైరెక్టర్ గారి దగ్గర సహ - డైరెక్టర్ లాగా చేరాలి. డైరెక్టర్ చెప్పినట్లుగా వినాలి. ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి.


హీరోలతో మంచిగా మెలగాలి. అలాగే నిర్మాతలతోను తోటివారితోను మంచిగా ఉండాలి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా పరిశీలించాలి. డైరెక్టర్ కెమెరాలను ఎలా ఉపయోగిస్తున్నారో గమనించాలి. ఎప్పటికప్పుడు మనలోని సృజనాత్మకతను బయటికి తీసుకురావాలి. అప్పుడప్పుడు డైరెక్టర్ కి సలహాలు ఇవ్వాలి. మనం సలహాలు ఇస్తున్నప్పుడు డైరెక్టర్ కి నచ్చినట్లయితే ఇంకా కలుపుగోలుగా ఉంటారు. అలాగే కొత్త కొత్త నిర్మాతలను కలుసుకుంటూ ఉండాలి. మనకు తెలిసిన రచయితలతో ఎప్పుడు సోదర భావంతో ఉండాలి. ఎందుకంటే మనకి రచయితలతో చాలా పని ఉంటుంది. ఒక సినిమా కథ బాగా ఉండాలన్నా సినిమా బాగా రావాలని అన్న డైరెక్టర్ పాత్ర ఎంతో, రచయిత పాత్ర చాలా ఉంటుంది.

మనకు తెలిసిన రచయిత తో ఒక మంచి కథను ఎన్నుకోవచ్చు. ఆ కథను తీసుకొని వెళ్లి నిర్మాతను కలిస్తే మనం కూడా డైరెక్టర్ అవ్వచ్చు. మనకథ తీసుకోవాలి, లేదా అన్నది నిర్మాత మేనా ఆధారపడి ఉంటుంది. అలాగే డైరెక్టర్ కూడా మనల్ని డైరెక్టర్లా గా పరిచయం చేయవచ్చు. పరిశ్రమ లో ఉన్న పెద్ద పెద్ద వాళ్లతో కలుపుగోలుగా మెలుగుతూ ఉండాలి. దీనికితోడు మన లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఒక మంచి సినిమాకి డైరెక్టర్ గా నీ చేసినట్లయితే తర్వాత కూడా పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు. ఇక సహా డైరెక్టర్ నుంచి డైరెక్టర్ స్థాయికి లో ఉండవచ్చు. మనకి తెలిసిన వాళ్ళు మనతో సినిమా తీయవచ్చు. ఒకసారి ప్రేక్షకుల్లోనూ మిమ్మల్ని డైరెక్టర్ లాగా ఆదరిస్తే ఇక మీకు తిరుగు ఉండదు. పరిశ్రమలో కొనసాగవచ్చు. విజయపరంపరను కొనసాగించవచ్చు. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు డైరెక్టర్ గా పని చేయవచ్చు. మన కృషి ఫలితమే మన సినిమా అనేది ప్రేక్షకులు ఆదరించాలని లేదా అనేది తెలుస్తుంది. పగలు,రాత్రి లేకుండా కష్టపడాలి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేది పరిశ్రమకు చాలా ఉపయోగం అయిన పదం. ఎంత కష్టపడితే అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయి.

మిమ్మల్ని మీరు డైరెక్ట్ లో చూసుకోవచ్చు. మీరు చేసే ప్రతి పని కూడా చాలా గమనించి చెయ్యాలి. ఎక్కడ తొందరపడకూడదు. పని మీద చాలా ఏకాగ్రతతో ఉండాలి. పరిశ్రమలో వీరు మంచి ఆదాయం కూడా పొందవచ్చు. అంటే కోటీశ్వరులు అవ్వవచ్చు. ఇక ప్రేక్షకుల చేత జై జై లే.

పాఠశాలలో మంచి ఉపాధ్యాయులను విద్యార్థులు ఎలా మరిచిపోగలరు

 ఒక వ్యక్తి సమాజంలో ఉన్నత హోదా కి వెళ్ళాలి అన్న, సమాజం అతన్ని గుర్తిస్తుంది అంటే దానికి కేవలం కారణం ఉపాధ్యాయులు అని చెప్పవచ్చు.ఒక వ్యక్తి లాయర్ అవ్వాలన్న, ఇంజనీర్ అవ్వాలన్న భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని అన్న దాంట్లో ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉంటుంది.చిన్నప్పటి నుంచి పిల్లవాడి లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీసేది కేవలం ఉపాధ్యాయులు మాత్రమే.


ప్రపంచంలో గొప్ప గొప్ప హోదా లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చెప్పే ఒకే మాట ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం కేవలం ఉపాధ్యాయులు.మాకు చక్కని విద్యాబుద్ధులను నేర్పించారు వారు.మేము ఎదుటి వ్యక్తి తో ఎలా మాట్లాడాలి చిన్న వాళ్లతో ఎలా ఉండాలి పెద్ద వాళ్ళతో ఎలా ఉండాలి.అనే విషయాలను మాకు చెప్పింది మా ఉపాధ్యాయులు.వాళ్లు పాఠాలు చక్కగా చెప్పారు కాబట్టి మేమ విని ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను.మేము తప్పు చేస్తే మమ్మల్ని ఖండించారు.అలాగే మమ్మల్ని చాలా అన్ని విధాలుగా ప్రోత్సహించారు.ఆట, పాటలను నేర్పించారు.కొట్టినా కసురుకుంది ఉపాధ్యాయులు అయినా విద్యాబుద్ధులు నేర్పించారు. 

ఒక వ్యక్తి సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే దాంట్లో ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉంటుంది. ఉపాధ్యాయులు చిన్నప్పుడే అంటే పదో తరగతి వచ్చే టప్పుడు విద్యార్ధి జీవితంలో ఏం సాధిస్తాడు ఏమి చేయగలడు అనే ఒక అవగాహన గురించి విద్యార్థులకు చెబుతారు.వాళ్లు ఏ రంగాల్లో రాణిస్తారు భవిష్యత్తులో అనే దని గురించి కూడా చెబుతారు.విద్యార్థుల్లో ఉన్నటువంటి లక్షణాలను గమనిస్తారు.తప్పు చేస్తే వాడిని మందలిస్తారు. ప్రపంచంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉంది.సమాజం లో ఒక వ్యక్తి మనుగడ సాగించాలన్న అభివృద్ధి చెందాలన్నా అది కేవలం ఉపాధ్యాయుల చలవే.

అందుకని మనం మన ఉపాధ్యాయులను ఎలా మర్చిపోగలం.విద్యలేనివాడు వింత పశువు అని చెప్పింది ఉపాధ్యాయులు.విద్యను నేర్చుకోవటం వలన మనకు జ్ఞానోదయం కలిగింది.అలాగే సమాజంలో ఎలా ఉండాలో తెలిసింది.పాఠశాల రోజులలో మనకి కష్టపడే తత్వాన్ని నేర్పిచింది ఎవరు.మన ఉపాధ్యాయులే కదా ప్రతి ఒక పాఠాన్ని క్షుణ్ణంగా మనకు చెప్పారు.తప్పు చేస్తే మందలించారు.బాగా చదవమని ప్రోత్సహించారు ఉపాధ్యాయులు.తల్లిదండ్రులను గౌరవించండి అని చెప్పారు.అన్నదమ్ములతో స్నేహంగా మెలగాలి అని చెప్పారు.

ఆటల వల్ల శారీరక మానసిక ఉల్లాసం ఎలా కలుగుతుందో చెప్పారు.మనల్ని మంచి విద్యార్థులు గా తీర్చిదిద్దారు. కోపం వలన విద్యార్థి ఏమి సాధించలేడు.కృషి, పట్టుదలతోనే సాధిస్తాడు.అందుకని మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం.ఇది మనం మన ఉపాధ్యాయులు ఇచ్చే గౌరవంగా భావించాలి.చదువుకోవడం వలన కలిగే ఉపయోగాలు గురించి మనకు ఉపాధ్యాయుల తెలపడం జరిగింది.మనకి తెలివితేటలు గురించి బోధించారు. మనలోని నైపుణ్యాలను తీసుకు బయటకు తీసుకు వచ్చింది ఎవరు.

కొన్ని సమస్యలను పరిష్కరించలేని వాటిని మన మనసులో నుంచి తీసేయాలి

 జీవితంలో మనిషి చాలా బాధలు ఉంటాయి.అలాగే ఆనందం కూడా ఉంటుంది.ఇక చూస్తే మనిషి జీవితంలో కొన్ని బాధలను ఏమీ చేయలేము.అంటే వాటికి పరిష్కారం దొరకక పోవచ్చు.ఆ సమస్యలకు పరిష్కారం నువ్వు మాత్రమే అని తెలుసుకో.ఆ సమస్యను మీ మనసులో నుంచి తీసేయ్.జీవితంలో ఎన్ని రోజులు సుఖాలు ఉంటాయి అన్ని రోజులు కూడా ఉండవచ్చు.ఏడ్చిన వ్యక్తి నవ్వక మానడు నవ్విన వ్యక్తి ఏడవక మానడు. పెద్దలు చెబుతూ ఉంటారు ఒక సమస్య ఉంటే ఆ సమస్య కచ్చితంగా పరిష్కార మార్గం ఉంటుంది.అదే ఆ పరిష్కార మార్గం ఏమిటి అంటే ఆ సమస్యని మనం మరిచిపో.


ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండాలని ఏమీ లేదు.ఎవరి ఆలోచనలు వారివి ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది.అమ్మ కడుపులో పుట్టే ప్రతి ఒక బిడ్డ ఒకేలా పుట్టాలని ఏమీలేదు. అంటే కొంతమంది కాళ్లు లేకుండా పుట్టవచ్చు చేతులు లేకుండా పుట్టవచ్చు.కొంతమంది మానసిక వికలాంగులుగా పుట్టొచ్చు.అలా పుట్టిన దానికి నువ్వు ఏమి చేయగలవు.ఆ సమస్యని మర్చి పోవడం తప్ప.పుట్టుక అనేది మన ఆధీనంలో లేదు.అలాగే మన మరణం కూడా మన ఆధీనంలో లేదు.ఇలాంటి విషయాల గురించి ఆలోచించాల్సిన పని అసలు లేదు.ఎందుకంటే ఇది ఉపయోగం లేని పని.అలాంటప్పుడు నువ్వు దేని గురించి బాధపడుతున్నావు ఆలోచిస్తున్నావు.

జీవితంలో ముందుకు వెళ్లాలంటే కొన్ని సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి.ఇప్పుడు ఉంది కేవలం బిజీ బిజీ జీవితమే అందరిదీ.ఈ సమస్యను ఎవరికి చెప్పినా కూడా వారు పట్టించుకోకపోవచ్చు.ఎందుకంటే మీ గురించి ఆలోచించే సమయం వారికి లేకపోవచ్చు.వాళ్ళ బాధ అనేది నీకు తెలియదు.మనుషుల పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటది.కానీ నువ్వు వాళ్ళ బాధ తో పోల్చుకోని నా భాద పెద్దది అని అనుకోకూడదు.నీకు చిన్నది నటించిన సమస్య వారికి పెద్దగా అనిపించవచ్చు అలాగే వాళ్ళకి పెద్దది అనిపించిన విషయం నీకు చిన్నగా కనిపించవచ్చు.

సమస్య ఇంకా వేధిస్తుంటే మానసిక నిపుణులను కలవడం చాలా మంచిది.వారు నీ సమస్యకు పరిష్కారాన్ని చూపించవచ్చు.కానీ కొన్ని సమస్యలను పరిష్కరించలేము. ఎలా అంటే కాళ్ళు పోతే ఆ కాలిని అలాగే మనం సర్దుబాటు చేయలేము.అలాగే జరిగిపోయిన గతం ని కూడా తీసుకొని రాలేము.ఈ సమస్యని మనం వదిలేసి మన జీవితంలో ముందుకు వెళ్లాలి.ఈ ప్రపంచంలో చాలా సమస్యలను పరిష్కరించలేము.మనిషిని వేధించే సమస్యలు ఈ రోజుల్లో మరియు ముఖ్యంగా మానసిక సమస్యలు ఉండవచ్చు.మనం ఆలోచించినట్లయితే ఎదుటి వ్యక్తి ఆలోచించాలి అని ఏమీ లేదు.ఎవరి ఆలోచనలు వారివి ఎవరి మనోభావాలు వాళ్ళవి.ఒక వ్యక్తి తప్పు చేస్తూ వుంటే తను చేసిన తప్పు అని చెప్పడం అంత వరకు నీ బాధ్యత.

కొన్ని విషయాలు తెలిసి కూడా మిమల్ని మీరు మోసం చేసుకోకండి

 ప్రతి టీన్ కష్టపడితేనే ఎంతటి ఉన్నత స్థానాలను అయినా అధిరోహించవచ్చు.అంతటి ఉన్నత స్థానాల్లో ఉండి కూడా కొంతమంది తప్పులను చేస్తారు.పెళ్లి చేసేటప్పుడు వారి కింద పనిచేసే వ్యక్తులకు హాని కలిగిస్తాయి.అలాగే వీళ్ళు చేసే మంచి పని వలన చాలా లాభాలు ఉంటాయి. సమాజంలో ఒక వ్యక్తి గాని, ఒక సంస్థ వారు గాని తప్పు చేస్తే దానిని మీరు ఖండించండి.ఎందుకంటే తప్పు చేసే వ్యక్తి తప్పులను చేసుకుంటూ పోతాడు.


ఈరోజు ప్రపంచం నడుస్తుది అంటే ఏమిటి అది కేవలం తప్పు చేయని వారు ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి.అంటే ఒక మంచి వ్యక్తి వలన సమాజానికి చాలా ఉపయోగం ఉంటుంది.ఇంకా అతను కొన్ని వందల మందిలో మార్పు తీసుకొని వస్తాడు.పాఠశాలలో ఉపాధ్యాయుడు తన జీవిత కాలంలో ఎంతోమంది విద్యార్థులను సమాజంలో ఎలా మెలగాలో నేర్పుతాడు.

అలాగే ఒక మంచి తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచి ప్రయోజకులు చేస్తారు.ప్రభుత్వ ఉద్యోగి జీతం తీసుకుంటూ అవినీతి చేస్తూ ఉంటాడు.అవినీతి చేయవలసిన అవసరం ఏముంది అసలు.ఆశ అనేది మనిషి చాలా హద్దులో ఉంచుకోవాలి.ఒక మనిషి బ్రతకడానికి మరియు అతని కుటుంబం బ్రతకడానికి ప్రభుత్వం ఇచ్చిన జీతం సరిపోతుంది.అంటే ప్రభుత్వ ఉద్యోగి గురించి నేను చెబుతున్నది.

ఉదాహరణకి ప్రభుత్వం తరఫున కట్టిస్తుంది అనుకుందాం. అవినీతి నాయకుల వలన, ప్రభుత్వ ఉద్యోగి వలన ఆ ఇల్లు నిర్మాణం పటిష్టంగా ఉండకపోవచ్చు.ఇందులో నాయకులకు, అధికారులకు డబ్బు సంపాదించాలి అనే ఆశ వలన కొన్ని లక్షల మందికి అన్యాయం జరుగుతుంది.

సమాజంలోని ఒక తప్పు జరిగితే ప్రశ్నించాలి.లేకపోతే చాలా కష్టం.కొంతమంది తప్పు గురించి ప్రశ్నించాలి అని అనుకుంటారు.తర్వాత మాకు ఎందుకులే మళ్ళీ సమస్య మన పైకి వస్తుంది అని భయం.ఇలాంటి వాళ్ళ వలన తప్పు అనే దానిని అరికట్టలేము.ఏది ఏమైనా ధైర్యంగా ఉండాలి. మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది మేము చేస్తూ ఉన్న పని అనేది చాలా తప్పు అని.బంధువులు అయినా సరే తప్పు చేస్తే ప్రశ్నించండి.దీనిలో మొహమాటం ఏది పెట్టుకోవద్దు.

నిజాయితీగా ఉన్న వ్యక్తి చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది అనే విషయాన్ని తెలుసుకోండి.ఏదిఏమైనా తప్పుడు వ్యక్తులను ప్రోత్సహించ వద్దు.అందరు బాగుంటే మనము బాగుంటాము అనే ధోరణిలో ఆలోచించాలి.ఎవరో భయపడుతున్నారు అని భయపడవద్దు.జీవితంలో ఏమి సాధించాలి అని అనుకుంటున్నారు ఆ దిశగా అడుగులు వేయండి.విజయం సాధించండి.ఎప్పుడు ఏ విషయంలో ఎవరికీ భయపడవద్దు.నిర్మొహమాటంగా మొహం మీదే చెప్పేయండి. గుర్తుపెట్టుకోండి మహానుభావులు ఎవరు కూడా తప్పుని ఎక్కడా స్వీకరించలేదు.అలాగే అలాంటి మనుషులను స్వీకరించలేదు.మీ మనసును ఎప్పుడు మీరు ప్రశ్నించుకోండి.నేను చేస్తున్న పని మంచిదా లేదా.

ఈ ప్రపంచంలో గొప్పవారి జీవితాలు ఆనందంగా ఉంటాయి అని అనుకోవడం మీ అవివేకం

 బాధలు అనేవి మనిషి జీవితంలో సర్వసాధారణం.నువ్వు బాధ అని అనుకుంటే బాధ సంతోషం అని అనుకుంటే సంతోషం.ఏది స్వీకరించారు అనేది మన ఇష్టం.డబ్బు ఉన్న వారు సుఖంగా బ్రతుకుతారు అని ఏమీ ఉండదు.డబ్బు లేని వారు దుఃఖంలో బతుకుతారు అని ఏమీ ఉండదు. ఎవరి బాధలు, ఎవరి కష్టాలు వారివి.గొప్ప వారి ఇంట్లో కూడా చాలా సమస్యలు ఉంటాయి.వారు కూడా బాధలు భరించాల్సి వస్తుంది.అంబానీ లాంటి వ్యాపారవేత్తను చూడండి ఎంత కష్టపడతాడు.


చాలామంది ఏమీ అనుకుంటారు అంటే అంబానీ ప్రశాంతంగా బ్రతుకుతూ ఉన్నాడు అని.ఎందుకంటే అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి.ఇది ఎంత మాత్రం వాస్తవం కాదు.ఆయన సమయానికి భోజనం చేయకపోవచ్చు. అలాగే అతనికీ కుటుంబం ఉంటుంది.సమస్యలు ఉంటాయి.వ్యాపారానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి.

ప్రతిపక్ష పార్టీలకు సమాధానాలు చెప్పాలి.అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంజాయిషీ చెప్పుకోవాలి.వారి కష్టాలు వారివి.అలాగే కలెక్టర్ గారు కూడా ఆనందంగా మరియు హుందాగా ఏమి జీవించారు.ఆయన మీద చాలా బాధ్యత ఉంటుంది.చాలా ఒత్తిడిని అనుభవిస్తారు.

అమెరికా అధ్యక్షుడు సైతం ఒత్తిడిని అనుభవించ వలసిన పరిస్థితి ఏర్పడుతుంది.ఒకవైపు కుటుంబానికి, ప్రజలకు సంజాయిషీ చెప్పుకోవాలి.ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎంత డబ్బు ఉన్న మనిషి ప్రాణాలను కాపాడే లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు పేదవాడు అయినా ఒకటే.ధనికుడు అయిన ఒకటే.గొప్ప వారి జీవితాలు డబ్బు ఎక్కువగా ఉన్న వారి జీవితాలు ఆనందంగా ఉంటాయి అనడం అవివేకం అవుతుంది.సమస్యలు అనేవి అందరికీ సర్వసాధారణం. సమస్యను చూసి బాధపడకూడదు.ఎవరి జీవితాలు వారివి, ఎవరి కష్టాలు వారివి.

గొప్ప వారు గొప్పగా జీవించాడు అని చెప్పి ఏమీ ఉండదు. బాధలు ఎవరివైనా ఒకటే.అందరి ఇళ్లల్లో సమస్యలు ఉంటాయి.సమస్య లేని జీవితం ఉండదు.

ధనిక పేద అనే వారికి సమస్యలు లేకుండా ఉండవు.ఎవరి జీవితాలు ఆనందంగా ఉండవు.ఏదో ఫేస్బుక్ లో ఫోటో దిగిన అంతమాత్రాన ఆనందంగా ఉన్నారు అని అనుకుంటాం.అది చాలా తప్పు.నవ్వినంత మాత్రాన ఆనందంగా ఉన్నారు అని చెప్పలేము.అలాగే బాధ పడినంత మాత్రాన బాధలో ఉన్నాము అని చెప్పలేం. సమస్య అనేది అందరికీ ఒకటే. మనం ఆలోచించే విధానంలో ఉంటుంది.ఈ విషయం తెలుసుకొని జీవించడం చాలా ముఖ్యం.ఎవరి బాధలు వారికి అర్థం అవతాయి. కొంతమంది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు కూడా కొంతమంది అర్థం చేసుకోకపోవచ్చు.అర్థం చేసుకోవాలి అనేది వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది.సమస్య అర్థం చేసుకున్న వ్యక్తి మేధావి అవుతాడు.మేధావులు సమస్యను చూసి బాధ పడరు.పరిష్కారం కోసం ఆలోచిస్తారు.

అక్టోబర్ 12, 2020

కేవలం డబ్బు మాత్రమే జీవితం అనుకోవద్దు.. డబ్బు ఉన్న సుఖము ఉండదు.. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి..

 రాజుకి 14 సంవత్సరాల వయసు. ఇతని నాన్న బ్యాంక్ మేనేజర్అమ్మ గృహిణి.ఇతని ఏమి పని చేసిన వాళ్ళ అమ్మ తిట్టేది. అంటే ప్రతి ఒకటి కొనాలి అని చెప్పేవాడు.దానికి వాళ్ల అమ్మ గ్రహించేది.ఒక రోజు రాజు స్నేహితుడు అందరూ కలిసి సముద్ర స్నానానికి వెళ్లారు.ఇంట్లో అమ్మ కు చెప్పకుండా రాజు మూడు వేల రూపాయలు తీసుకొని వెళ్ళాడు.ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చాడు.రెండు రోజులు అయినా తర్వాత రాజు వాళ్ళ అమ్మ బీరువా తెరిచి చూసింది.ఆమె బీరువా లో ఉన్నటువంటి 10 వేల రూపాయలను లెక్క పెట్టింది.


దానిలో మూడువేల రూపాయలు కనిపించలేదు.వెంటనే భర్త కి ఫోన్ చేసింది.డబ్బులు కనిపించడం లేదు మీరు ఏమైనా తీశారా అని.దానికి సమాధానం చెప్పారు తీయలేదు అని.తర్వాత రాజుని అడిగింది ఏరా నువ్వు ఏమైనా డబ్బులు తీసావ్ అని.దానికి రాజు చెప్పాడు అమ్మమ నేను డబ్బులు తీశాను.ఆగ్రహించిన అమ్మ ఎందుకు తీసావ్పు రా అని చెప్పి రాజుని కొట్టింది.




రాజు వాళ్ళ ఇంటిదగ్గర వారు చాలా నిరుపేదలు. తినడానికి తిండి కూడా ఉండేది కాదు.ఆ ఇంట్లో కమల్ అనే అబ్బాయి ఉండేవాడు.అతని వయసు 15 సంవత్సరాలు.ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. కానీ చదువులో దిట్ట.చాలా బాగా చదివే వాడు. రాజు 9వ తరగతి ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు.రాజు ఎప్పుడు అమల్ తో ఉండేవాడు. దానికి రాజు యొక్క అమ్మ అతనితో తిరగవద్దు.వాళ్ళు పేదవాళ్ళు అని అనుకొనేది.అయినా రాజు ని అమ్మ మాటలు పట్టించుకోని వాడు కాదు.ఒక రోజు రాజు యొక్క నాన్న ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి రోడ్డు ప్రమాదం జరిగింది.ఆ ప్రమాదంలో రాజు నాన్న యొక్క రెండుకాళ్లను తీసివేశారు.రాజు యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి కేవలం రాజు యొక్క తాతగారు మాత్రమే వచ్చారు.కానీ పేదవాడు అయినప్పటికీ కమల్ వాళ్ళ కుటుంబం అంతా వచ్చి పరామర్శించిది.అప్పుడు రాజు వాళ్ళ అమ్మ కు అర్థం అయ్యింది.కేవలం డబ్బు ఉంటేనే జీవితంలో సుఖం ఉండదు అని.మనకోసం మనం ఏ మనుషులు లేకపోతే కష్టం అని అనుకుంది.అప్పటి నుంచి కమల్ వాళ్లను కుటుంబం, పేద వారితో కలుపుగోలుగా ఉండేది.

అక్టోబర్ 03, 2020

సింగపూర్ దేశం గురించి ప్రపంచంలోని అందరూ తెలుసుకోవాలి కచ్చితంగా

 


ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నవి.కానీ సింగపూర్ చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఈ దేశం చూడడానికి కేవలం ఎటుచూసినా నలభై కిలోమీటర్లు అంటే ఎంత చిన్నదేశం చూడండి.ప్రపంచంలో ఇంతకన్నా చిన్న దేశాలు చాలా ఉండవచ్చు.కానీ అభివృద్ధి గురించి మాట్లాడాలంటే మన సింగపూర్ గురించి మాట్లాడవచ్చు.అలాగే భద్రతా పరంగా కూడా చాలా కఠిన నియమాలు ఉంటాయి.ఇక్కడ జనాభా కూడా చాలా తక్కువే లక్షల్లోనే ఉంటారు.



అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ గురించి మాట్లాడాలంటే ప్రపంచంలోనే అతి ఖరీదైన హోటళ్లు ఉన్నవి.దేశానికి ఒక వైపు మలేషియా దేశం.ఇంకా ఎటుచూసినా సముద్రం ఉంటుంది.ప్రపంచంలో ఉన్నాం ఐటీ పరిశ్రమలు మరియు సివిల్ ఇంజనీరింగ్ పరిశ్రమలు సింగపూర్ లో అధికంగా ఉన్నవి.సింగపూర్ ని భూలోక స్వర్గం అని చెప్పవచ్చు.


జీవితం ఎటు అయినా వెళ్ళవచ్చు మిత్రమా.. నువ్వు శ్రమించు

నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి మిత్రమా.నీ కోసం ఎవ్వరు రారు.అస్సలు వస్తారు అని కూడా అనుకోకు.ఎవ్వరి బాధలు వారివి.ఎవ్వరి కష్టాలు వారివ...