ప్రతి మనిషి జీవితంలో ఉపయోగపడేవి మరియు కొన్ని చిన్న కథలు
అక్టోబర్ 17, 2021
జీవితం ఎటు అయినా వెళ్ళవచ్చు మిత్రమా.. నువ్వు శ్రమించు
నవంబర్ 02, 2020
సరిగ్గా పట్టించుకునే వాళ్ళు లేకపోతే ఎలా
కవిత మా ఇంటికి పెద్ద కూతురే కాదు, రెండు కుటుంబాలకు పెద్ద మనవరాలు కూడా. కవిత పుట్టినప్పుడు కుటుంబం అంతా మా ఊరిలో ఉన్న ఫంక్షన్ కి వెళ్లడం వలన సమయానికి కవిత వాళ్ళ అమ్మ దగ్గర ఎవరూ లేకపోయారు. ఆ సమయంలో హాస్పటల్కి తీసుకెళ్లడానికి సరైన సమయం లేక ఇంటిలో దగ్గరలోని మంత్రసాని చేత పురుడు పోయించారు లలిత అమ్మా నాన్న. ఆ మంత్రానికి సరైన అవగాహన లేక చంటి బిడ్డను పుట్టిన వెంటనే ఏడిపించక పుట్టిన బిడ్డను అలాగే నేలమీద పడుకోబెట్టింది.
ఆ తరువాత కార్యక్రమాలు యధావిధిగా జరిపించి, పుట్టిన పాపాయికి నామకరణం చేసింది కవిత అనే పేరు పెట్టారు. కవిత ఒక సంవత్సరం నిండింది, కానీ అందరి పిల్లల బోర్లా పడడం చేయడం లేదు. ఎక్కడ వేసిన అక్కడే కదలక, మెదలక కుండా ఉండేది.లలితకు కూడా చిన్న వయసు కావడం ఎప్పుడూ తన లోకం పుస్తకాలే కావడం వలన కవితను పట్టించుకునేది కాదు. కవితా తాతగారు లలిత నాన్న గారైన సోమనాథ్ కి ఊళ్లు తిరిగి ఉద్యోగం కావడం వలన వెళ్లిన చోట సరైన సదుపాయాలు లేక పట్టించుకోలేదు.
తరువాత వెనక్కి తిరిగి చూసేసరికి కవిత పరిస్థితి తెలుసుకుని బాధపడి తన ఇంటికి తీసుకుని వెళ్ళి కవిత కవిత మానసిక వికలాంగురాలు అని తెలుసుకుని మందులు వాడుతూ స్వీకరించారు సోమనాథ్. ఆ తరువాత కవిత వాళ్ళ అమ్మమ్మ వాళ్లది చాలా పెద్ద కుటుంబం కావడం వలన అందరి ఆలనాపాలనా కవిత మెల్లమెల్లగా పాకడం చిన్నగా లేచి నిలబడడం చేస్తుంది. కవిత కు ఐదు సంవత్సరాలు వచ్చాయి. లలితా కార్యక్రమంలోనూ ఒక బాబు పుట్టడంతో కవితను పూర్తిగా వాళ్ళ నాన్నగారి దగ్గర వదిలేసింది. కవిత వాళ్ళ తాతగారు ట్రాన్స్ఫర్ మీద లలిత ఉన్న ఊరికి దగ్గరగా రావడం వలన తరుచూ అంతా కలిసి ఉండేవారు.
కొన్నాళ్ళకి సోమనాథ్ గారికి రిటైర్మెంట్ వయసు దగ్గర పడడంతో లలిత ఉన్న ఊరిలో ఇల్లు కట్టుకుని లలితను కూడా తాము దగ్గర ఉంచుకోవాలి అన్న ఆలోచన చేసి అటు వైపు అడుగులు వేశారు. ఆ విధంగానే ఈ కవితను మానసిక వికలాంగుల పాఠశాలలో చేర్చి, తానే దగ్గర ఉండి కవిత విషయాలు చూసేవారు తాతగారు. అలా కవిత కొంచెం బాగవుతుంది సమయానికి సోమనాథ్ గారు,అతని భార్య రెండు సంవత్సరాల గ్యాప్ లో మరణించారు.
అంతవరకూ కవితా బాధ్యత లేని లలితా భార్యాభర్తలు కవితను పట్టించుకోలేదు.తిరిగి స్కూల్ మానిపించి ఇంట్లో ఉంచేశారు.కవిత పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. అమ్మమ్మ ఉన్నప్పుడు ఎంతో సందడిగా ఉన్న ఇల్లు అమ్మమ్మ తదనంతరం ఎవరికి వారు అవ్వడం వలన కవిత వాళ్ళ తాతగారు కవిత కుటుంబాన్ని ఇంట్లో పెట్టుకున్నారు. కానీ సోమనాథ్ గారి మరణాంతరం కవితను పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. రాను రాను కవిత ఏది తినాలన్నా రకరకాల జబ్బుల పేరు చెప్పి సరిగా భోజనం కూడా పెట్టేవారు కాదు లలిత వాళ్ళు. ఆఖరికీ కవిత కన్నా తల్లిదండ్రుల కే భారంగా తయారయ్యి, సరియైన ఆలనాపాలనా లేక మరణించింది.
నవంబర్ 01, 2020
ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది
మాది చక్కటి పల్లెటూరు ఆకాశంలో మేఘాలు పక్షుల కిలకిల రావాలు ఎంతో ఆనందంగా ఉంటుంది.ఇంతలో రైతు కి మరింత ఆనందం కలిగించే మంచి వార్త వచ్చింది.అదేమిటంటే మా ఊరికి రాజధాని వచ్చిందో మేము త్వరలో కోటీశ్వరులు అవుతామ అంటూ సంతోషంతో అయిపోయాడు రైతు.ఇంతలో అధికారులు వచ్చి సర్వే చేసి మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అంటూ హామీలు కురిపించారు.రాజధాని కోసం భూములు కొనుగోలు జరిగింది రైతులు సంతోషం ఆగలేదు తమ పిల్లల భవిష్యత్తు మరింత అభివృద్ధి చెందుతుందని చాలా సంతోషపడ్డారు.
రైతు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. సుఖసంతోషాలతో హాయిగా ఉన్నాడు వ్యవసాయం చేసే పని లేదని సంతోషంలో ఉన్నాడు.ఇలా రైతుకి ఊహించలేనంత అదృష్టం రాగానే తమ పిల్లలకు ఉన్నత చదువుల కోసం వాళ్ల భవిష్యత్తు కోసం రాజధాని భూములు అమ్మి నా డబ్బుతో బ్యాంకులో డిపాజిట్ చేసి కాస్త కాస్త ఖర్చు చేస్తున్నాడు.ఇలా రైతు తన జీవితాన్ని ఆనందంగా సాగించాడు.మాకు ఇంత మేలు చేసిన అధికారులకు ముఖ్యమంత్రికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు రైతులు.
ఇంతలో ఎలక్షన్ టైం రానే వచ్చింది. అంతా మంచి పని చేసిన రైతులకీ ఆ ముఖ్యమంత్రికి ఏమాత్రం ఊహించని అంతగా ఓటమిపాలై చవిచూశారు. కారణం రాజకీయ చరిత్ర మారాలి రాజ్యాంగం మార్పు రావాలి దేశ ప్రగతి ముందుకు పోవాలి అని మరింత బలంగా నమ్మి కొత్త ప్రభుత్వానికి నాంది పలికారు రైతులు.
అలా ఏ దేశమేగినా ఏదైనా జరిగినా నీ వెంటనే ఉంటాను అంటూ పలికాడు మీకోసమే ఉంటాను నీ వెంటే ఉంటాను నీతోనే ఉంటాను ఒక అన్న ఉంటాను తమ్ముడిలా ఉంటాను అంటూ ఏవేవో చెప్పాడు. రాజకీయ నాయకుడు అయ్యాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. మంచి వారు అనుకుంటున్నారు మంచి చేస్తారు అనుకున్నారు అనుభవం లేకపోయినా పర్వాలేదు మంచి చేస్తే చాలా అనుకున్నాము కానీ రైతుల నోట్లో మట్టి కొట్టి చూపించాడు.
ప్రజలారా ఓటు ఎంత విలువైందో ఇప్పటికైనా గ్రహించండి మీరు వేసే ఓటు పదిసార్లు ఆలోచించి ఓటు వేయండి ఈ నియోజకవర్గం యొక్క క్యాండెట్ మంచివాడు అని తెలిస్తే వారికి ఓటు వేయండి తప్పులేదు కానీ ఇటువంటి వాళ్లు మనకు పనికి రాని వాళ్లందరికీ ఓటు వేస్తే భవిష్యత్తు అస్తవ్యస్తం అవుతుంది దేశం వెనుకబడి పోతుంది.
కోపం వల్ల కలిగే అనర్ధాలు
ఒకరోజు తీరిగ్గా కూర్చుని కిటికీ బయటకు చూస్తున్నాను.రోడ్డు పక్కన బండి మీద చాయ్ వేస్తున్నాడు రాజు.ఆ రోజు పని ఎక్కువైంది అతనికి. లారీ డ్రైవర్లు, క్లీనర్లు వేరే వాళ్ళు అందరూ అక్కడ చాయ్ తాగి వెళ్తున్నారు.అంతా కోలాహలంగా ఉంది.
కుక్క అక్కడి జనాల మధ్య తిరుగుతూ వాళ్ళు ఏదైనా పడేస్తే తింటుంది.రాజు దాన్ని తరుముతున్నాడు, ఎంత తరిమిన మళ్ళీ వచ్చి జనాల కాళ్ళ మధ్య జరుగుతుంది.కొందరు దాన్ని దగ్గరకు పిలుచుకొని బిస్కెట్ లాంటివి తినిపిస్తున్నారు.
ఒక డ్రైవరు ఫోన్లో ఎవరితోనో కోపం గా మాట్లాడు కుంటూ ఛాయ్ బండి వైపు వచ్చి కూర్చున్నాడు. కోపంగా మాట్లాడుతూ రాజు ఇచ్చిన ఛాయ్ చేతిలోకి తీసుకున్నాడు.ఇంతలో కాలికి ఏదో తగ్గినట్టు అనిపించినా ఒక్కసారిగా లేచేసరికి చేతిలో ఉన్న చాయ్ షర్ట్ పై పడిపోయింది. ఏమైంది ఏమైంది అంటూ వచ్చి చూసాడు రాజు. రాజు ఏముంది అదే కుక్క, రాజు మీద గయ్ మని లేచాడు ఆ డ్రైవర్. ఈ కుక్కలు ఎందుకు పెంచుతున్నావు అని కేకలు పెట్టాడు. లేదు ఆ పక్క నాది కాదు క్షమించండి అని చెప్పి అతనికి ఇంకో చాయ్ ఇచ్చి పంపించాడు. కుక్క ను తిడుతూ దాని మీదకి బండరాయిని కోపంగా విసిరాడు రాజు, కుక్క తప్పించుకుని దూరంగా పారిపోయింది. రాజు మళ్లీ పనిలో నిమగ్నమయ్యాడు.
జనాలు వస్తున్నారు వెళ్తున్నారు,కొద్దిసేపు కుక్క కనబడలేదు. ఎండ నడి నెత్తి మీద వచ్చింది. రాజు వ్యాపారం చాలా బాగా నడుస్తుంది కానీ చాలా పని ఒత్తిడిలో ఉన్నాడు. పాల ప్యాకెట్ చింపి గిన్నెలో పోశాడు. ఎవరో పలకరించగా అటు తిరిగాడు ఇంతలో గిన్నె పడిన చప్పుడు విని ఇటు చూశాడు. కుక్క పాలన్నీ పారబోసి ఉంది. అతనికి మతిపోయింది, కోపంతో ఊగిపోయాడు. పెద్ద కర్ర తీసుకొని కుక్క నడుము మీద ఒక్క దెబ్బ వేసాడు. కుక్క కుప్పకూలిపోయింది. రాజుకి కోపం చల్లారలేదు ఇంకో దెబ్బ వేసేసరికి అది సరిగ్గా కుక్క తల పై పడింది. ఆ దెబ్బకి కుక్క చచ్చిపోయింది. అందరూ చూస్తూ ఉండిపోయారు. కుక్క చనిపోతుందని అతను అనుకోలేదు.
ఇంతలో నాలుగు కుక్క పిల్లలు వచ్చి చనిపోయిన కుక్క చుట్టూ చేరాయి. పాపం ఆ పిల్లలు దానివి. అది కళ్ళు తెరిచి నడక నేర్చుకున్న సమయానికి అది చనిపోయింది. ఆ దృశ్యం హృదయాన్ని పిండేసే లా ఉంది. చూసిన వాళ్ళందరూ రాజుని తిట్టిపోశారు, అన్యాయంగా మూగ జీవిని చంపావు అన్నారు. రాజు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కొద్ది సేపటికి తేరుకుని కుక్కపిల్లల్ని దగ్గరికి తీసుకుని వాటికి ఆప్యాయంగా పాలు తాగించాడు.
అక్టోబర్ 24, 2020
ముందు మిమల్ని మీరు నమ్మండి
ఏదైనా పని చేసేటప్పుడు ఈ పని చేయగలనా లేదా అనే ఆలోచన మనిషికి రావడం సర్వసాధారణం. మీరు ఖచతంగా చేస్తారు అంటే ఆ పని ఏదైనా చేయగలరు. లేదు నావల్ల కాదు నేను చేయలేను అంటే చేయలేరు. ఉదాహరణకు మీకు క్రికెట్ ఆట అంటే చాలా ఇష్టం. కానీ మీరు క్రికెట్ ఆటలు ఆడ లేరు. అంటే ఇష్ట పడ్డారు కానీ ఆడడం రాదు. మీరు ఖచతంగా నేను ఆడాలి అని పట్టుదలతో ప్రయత్నిస్తే కచ్చితంగా నేర్చుకోగలరు. సచిన్ ఆట అంటే ఇష్టం. మీరు ప్రయత్నిస్తే సచిన్ లాగా ఖచ్చతంగా ఆడగలరు. ఏదైనా ప్రయత్నించడం చాలా ముఖ్యం. ప్రయత్నించి ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం.
ముందు మిమ్మల్ని మీరు 100% ఖచ్చితంగా నమ్మండి. అందరు మనుషులు ఒకటే. ఎవరైనా చనిపోవలసింది అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. పుట్టుక మరియు చావు మధ్య మనిషి బ్రతుకు. ఇందులో కొంతమది విజయం సాధిస్తారు. కొంతమంది సాధించలేకపోవచ్చు. సాధించాలి అనే తపన ఉన్న వ్యక్తికి అంగవైకల్యం అనేది అడ్డురాదు. కేవలం మనిషికీ మెదడు అతి ముఖ్యమైనది. ఇంకా మన ఆలోచనా విధానం అనేది చాలా ముఖ్యం. ఒక విషయాన్ని చాలా విధాలుగా ఆలోచించవచ్చు. మీరు లేక నేను ఎలా ఆలోచిస్తూ ఉన్నాను అనేది అవసరం.
cr
సమస్య గురించి ఆలోచిస్తే సమస్య ఎక్కువ అవుతుంది. కొన్ని సమస్యలను ఏమీ చేయలేము. అంటే మన జీవితంలో చచ్చేవరకు వాటిని అనుభవించవలసిందే. వాటి గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయకూడదు. సమస్య సమస్య అలాగే చూడాలి.
పెద్దలు చెప్పినట్లు ప్రతి ఒక సమస్యకు పరిష్కారం ఉంటుంది. అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. వాళ్లు ఎందుకు ఆ మాట అన్నారు అనేది ఆలోచించాలి. అవును ప్రతి ఒక సమస్యకు పరిష్కారం ఉంది. అది నువ్వే. నువ్వు అనుకుంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలవు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే జీవితంలో ఎప్పుడు ఆనందమే ఉండదు కూడా ఉంటుంది అనేది. ఎప్పుడు,ఎక్కడ ఏ విషయానికి అసలు భయపడవద్దు. భయపడితే భయమస్తుంది. భయం లేదు అనుకుంటే ఏమీ ఉండదు. ఉదాహరణకు పుట్టుకతో రెండు చేతులు లేకుండా పుడితే మీకు ఒక వయస్సు వచ్చిన తర్వాత తెలిసి ఈ విషయం గురించి బాధ పడితే ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆ విషయం గురించి మీరు ఏమీ చేయలేరు. మనం మార్చలేని దాని గురించి ఆలోచించడం అనవసరం. ఎందుకంటే అది పుట్టుకతో వచ్చిన లోపం ఆ లోపాన్ని సరి చేయలేము. ఆ విషయాన్ని అంతటితో వదిలేయ్ జీవితంలో ముందుకు వెళ్ళాలి. గతం గతః అన్నట్లుగా ఉండాలి. ఇలా అనడం చాలా తేలికే. కానీ అనుభవించే వారికి ఆ బాధ అనేది పదేపదే మనసును చేస్తూ ఉంటుంది. తప్పదు ఇంకో మార్గం లేదు.
మీ మెదడును పదును పెట్టండి. మనిషి అనుకుంటే ప్రతిదీ చేయగలడు అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి.
అక్టోబర్ 17, 2020
స్నేహితులతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళినప్పుడు
ఆరోజు ఉదయం 9 గంటలకు వర్షం పడుతుంది. క్రికెట్ మ్యాచ్ సాయంత్రం 4:30కి. ఈ రోజు మ్యాచ్ జరుగుతుందా లేదా? వర్షం ఎక్కువగా ఉంది. మ్యాచ్ జరిగితే బాగుండు అనేది నా అభిప్రాయం. ఇంతలో స్నేహితులు సందేశం చేస్తున్నారు. పరిస్థితేమిటి? వర్షం పడుతుంది గా. నా ఫ్రెండ్స్ పేరు చెప్పడం మర్చిపోయాను. రాజు,రోజా, లక్ష్మి ,రాణి, సాకేత్, అందరికి క్రికెట్ అంటే చాలా ఇష్టం.
ఇంతలో రాజు సందేశం పంపించాడు. ఈ రోజు సమయం బాగుంటుంది లే. మనం ఆటకి వెళ్ళవచ్చు. వర్షం తగ్గిపోతుంది రాహుల్. నా పేరు రాహుల్. సమయం ఉదయం 11 గంటలు అయినది. అయినా వర్షం పడుతూనే ఉంది. మొత్తానికి మధ్యాహ్నం వర్షం కురవడం ఆగిపోయింది. మైదానం ఇంటి స్థలం నుంచి దాదాపు 15 మైళ్ళు. సాకేత్ నాన్నగారికి నాలుగు కారు వాహనం ఉంది. అది వేసుకొని సాకేత్ మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొని మా ఇంటికి వచ్చాడు. మా నాన్నగారికి చెప్పాను. మైదానానికి వెళ్తున్నాం నాన్నగారు అని. సరే జాగ్రత్తగా వెళ్ళండి అని. సాకేత్ వాహనం లో మంచి పాటలు పెట్టాడు. రోజా కూడా పాటలు పాడుతుంది. రాజు అడిగాడు రోజాను పాడుఅని. రోజా పాడను అని చెప్పింది.
సమయం సాయంత్రం 4 అయింది. మైదానం లో ప్రేక్షకులు ఉన్నారు. ఇంతకీ మేము వెళ్ళింది ఎక్కడికో తెలుసా.విశ్వవిద్యాలయాల తుది సమరం కోసం.మేము తినడానికి కొన్ని పదార్దాలను తీసుకువెళ్ళాము.ఆట ప్రారంభం అయినది.
ఇది 20. స్నేహితులతో పాటు మేమందరం మ్యాచ్ చూస్తున్నాము.ఆట ఆసక్తిగా ఉంది. ఇంతలో రాజు హాస్యం చేస్తున్నాడు. మిగతా స్నేహితులం అందరం నవ్వుకుంటున్నాము.మేము అందరం తిరుగు ప్రయాణం అయ్యాము. రాజు కి జ్వరం తగిలింది.
దగ్గరిలోనీ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాము. వైద్యులు రాజు జ్వరం చూశారు. 102 ఉంది. రాజు చాలా కంగారు పడిపోతూ ఉన్నాడు.వైద్యులు సూది మందు మరియు బిళ్లలు ఇచ్చారు. కొంచెం విశ్రాంతి తీసుకున్నాడు. తిరుగు ప్రయాణం అయ్యాము. రాజుకి తండ్రి ఫోన్ చేసారు. ఇలా జరగడం దురదృష్టం విషయం. ఇలా చాలా సరదాగా గడిపారు. ఈరోజు మా జీవితంలో గుర్తుండిపోయే రోజు. ఇలాంటి రోజులు ఇంకా రావాలి అని చెప్పి అనుకుంటున్నాము. మళ్లీ కచ్చితంగా వచ్చే నెలలో చలనచిత్రం చూడడానికి వెళ్తాము. క్రికెట్ మా జీవితాలలో భాగం. మేమందరం ఏం చెబుతున్నారో మీకు చెప్పలేదు కదా. డిగ్రీ చదువు చదువుతున్నాము. రాజు కి సందేశం పంపించాను. ఎలా ఉన్నావు రాజు. రాజు సమాధానం ఇచ్చాడు ఏమీ బాగాలేదు నా ఆరోగ్యం. మళ్లీ వైద్యుని అవసరం ఉంది. సరే రాజు అని నేను చెప్పాను. ఇంతలో రోజా సందేశం పంపింది. రాజు ఎలా ఉంది అని. నేను అడిగాను నువ్వు మాట్లాడలేదా రాజుతో. లేదు అని సమాధానం చెప్పింది. సరే మాట్లాడు.మేమందరం రాజు ఆరోగ్యం గురించి సందేశాలు పంపుకున్నాము. ఎన్ని బాధలొచ్చినా స్నేహితుడికి అనేది కష్టంగా ఉంటుంది.
మరుసటి రోజు మేము అందరం కలిసి రాజు ఇంటి దగ్గరికి వెళ్లడం జరిగింది. మేము వెళ్ళే సరికి రాజు నిద్రపోతూ ఉన్నాడు.
క్రికెట్ ను నేర్చుకోవాలి అంటే మంచి శిక్షకుడు కూడా అవసరం
ప్రపంచంలో చాలా ఏదైనా ఉంది అంటే అది క్రికెట్ అని చెప్పవచ్చు. 10 వయసు పిల్లవాడి దగ్గరి నుంచి ముసలి వరకు క్రికెట్ ఆడడానికి ఇష్టపడతారు. ఇంకా భారతదేశంలో క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు. క్రికెట్ ఆటను నేర్చుకోవాలి అంటే ముందుగా క్రికెట్ అకాడమీ లో చేరాలి. 8 వయసు బాబు లా ఉన్నప్పుడు అకాడమీలో చేరవచ్చు.మంచి శిక్షకుడు చేరడం చాలా ఉపయోగం. అతను ఆటలో మెలకువలను నేర్పిస్తాడు.12, 14, 16 లోపు వయసు మ్యాచ్లు ఆడిస్తాడు. మీ శైలి ఎలా ఉందో అనేది మంచి శిక్షకుడు గమనిస్తాడు. మీరు ఏ శైలిలో ఆడాలో చూపిస్తాడు.
క్రికెట్ ఆటను పెద్దవాళ్ళు కూడా ఆడవచ్చు. అదే తీసుకోవచ్చు. క్రికెట్ ఆటలో ముఖ్యంగా ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ అనే భాగాలు ఉంటాయి. అందులో ఆటగాడు ఏ భాగానికి సరి చేయగలలు అనే విషయాన్ని కేవలం శిక్షకుడు మాత్రమే నిర్ధారించగలడు. శిక్షకుడు ఆటను నేర్చుకునే భాగంలో వ్యాయామాలు చేయిస్తాడు. శిక్షకుడి మాటను తూచా తప్పకుండా పాటిస్తే మంచి ఆటగాడు అవ్వచ్చు. ఆటగాడు నియమాలను పాటించాలి. క్రికెట్ నేర్చుకోవడం కోసం చాలా కృషి చెయ్యాలి.
ఆటలో బౌలింగ్ సంబంధించినటువంటి వాటిని బాలింగ్ శిక్షకుడు చూసుకుంటాడు. ఫీల్డింగ్ సంబంధించి న టువంటి వాటి గురించి ఫీల్డింగ్ శిక్షకులు చూసుకుంటాడు. ఆటగాడు ఉదయాన్నే వ్యాయామం చెయ్యాలి. ఆటగాడికి కష్టపడే తత్వం ఉండాలి. మైదానంలో చాలా దెబ్బలు తగులుతాయి. వాటిని తట్టుకుని నిలబడగలగాలి. నేర్చుకునే వారు శిక్షకుడు చెప్పింది శాసనంగా భావించాలి. శిక్షకుడు బ్యాట్ మెన్ కూ కాళ్ళను ఉపయోగించి ఎలా ఆడాలో నేర్పుతాడు. తాము వరకు నేర్చుకున్నారు అనేదాని గురించి శిక్షకుడు మ్యాచ్లను నిర్వహిస్తాడు. ఇందులో ఆటగాడి ప్రతిభను శిక్షకుడు చూస్తాడు. దెబ్బలు తగలకుండా జాగ్రత్త మీదే.జాగ్రత్తగా ఉన్నా దెబ్బలు తగులుతాయి. శిక్షకుడు మీకు బాలింగ్ ఎలా వేయాలో నేర్పుతాడు. ఫీలింగ్ ఎలా చేయాలో నేర్పుతాడు. క్యాచ్ లు ఎలా పట్టాలు చూపిస్తాడు. మీ ఆసక్తి కూడా చాలా ముఖ్యం. మైదానంలో మీరు చాలా చురుకుగా పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం వేడినీళ్ళతో స్నానం చెయ్యండి.
క్రికెట్ ఆడే వాళ్ళు ఎప్పుడు చాలా ఉత్సాహంగా పరిస్థితి ఏర్పడింది. మనసు మొత్తం క్రికెట్ పై లగ్నం చేయాలి. శిక్షకుడు చెప్పినట్లుగా వినాలి. సుజుకి రోజూ మీ ప్రతిభను కనబరిచి ఉండాలి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మిరే. పరిస్థితి ఏర్పడింది. మీరు మైదానంలో చురుకుగా ఉంటే బాగా నేర్చుకోవచ్చు. మీ తోటి ఆటగాళ్లతో కలుపుగోలుగా ఉండాలి. మీరు ఎలాంటి క్యాచ్లు అయితే పట్టలేకపోతున్నారు వాటికోసం శిక్షకుడు తర్ఫీదు ఇస్తాడు. సమయం మైదానంలోనే గడపాలి. దూరదర్శన్ ని చూడాలి. ప్రముఖులు ఎలా ఆడుతున్నారు గమనించాలి. ప్రతి రోజూ మైదానం కి వెళ్ళి తీసుకోవాలి.ద్రుష్టి మొత్తం క్రికెట్ పై ఉండాలి. ఏ రోజు చెందకూడదు.విషయాలు నేర్చుకోవాలి. దెబ్బలు పట్టించుకోకూడదు. రోజు మైదానంలో కష్టపడాలి. శిక్షకుడు చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. ఈ షాట్ ఎలా అయితే ఎటు వెళ్ళిందో గమనించాలి.
జీవితం ఎటు అయినా వెళ్ళవచ్చు మిత్రమా.. నువ్వు శ్రమించు
నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి మిత్రమా.నీ కోసం ఎవ్వరు రారు.అస్సలు వస్తారు అని కూడా అనుకోకు.ఎవ్వరి బాధలు వారివి.ఎవ్వరి కష్టాలు వారివ...

-
బాధలు అనేవి మనిషి జీవితంలో సర్వసాధారణం.నువ్వు బాధ అని అనుకుంటే బాధ సంతోషం అని అనుకుంటే సంతోషం.ఏది స్వీకరించారు అనేది మన ఇష్టం.డబ్బు ఉన్న వ...
-
ఏదైనా పని చేసేటప్పుడు ఈ పని చేయగలనా లేదా అనే ఆలోచన మనిషికి రావడం సర్వసాధారణం. మీరు ఖచతంగా చేస్తారు అంటే ఆ పని ఏదైనా చేయగలరు. లేదు నావల్ల క...
-
నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి మిత్రమా.నీ కోసం ఎవ్వరు రారు.అస్సలు వస్తారు అని కూడా అనుకోకు.ఎవ్వరి బాధలు వారివి.ఎవ్వరి కష్టాలు వారివ...