మాది చక్కటి పల్లెటూరు ఆకాశంలో మేఘాలు పక్షుల కిలకిల రావాలు ఎంతో ఆనందంగా ఉంటుంది.ఇంతలో రైతు కి మరింత ఆనందం కలిగించే మంచి వార్త వచ్చింది.అదేమిటంటే మా ఊరికి రాజధాని వచ్చిందో మేము త్వరలో కోటీశ్వరులు అవుతామ అంటూ సంతోషంతో అయిపోయాడు రైతు.ఇంతలో అధికారులు వచ్చి సర్వే చేసి మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అంటూ హామీలు కురిపించారు.రాజధాని కోసం భూములు కొనుగోలు జరిగింది రైతులు సంతోషం ఆగలేదు తమ పిల్లల భవిష్యత్తు మరింత అభివృద్ధి చెందుతుందని చాలా సంతోషపడ్డారు.
రైతు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. సుఖసంతోషాలతో హాయిగా ఉన్నాడు వ్యవసాయం చేసే పని లేదని సంతోషంలో ఉన్నాడు.ఇలా రైతుకి ఊహించలేనంత అదృష్టం రాగానే తమ పిల్లలకు ఉన్నత చదువుల కోసం వాళ్ల భవిష్యత్తు కోసం రాజధాని భూములు అమ్మి నా డబ్బుతో బ్యాంకులో డిపాజిట్ చేసి కాస్త కాస్త ఖర్చు చేస్తున్నాడు.ఇలా రైతు తన జీవితాన్ని ఆనందంగా సాగించాడు.మాకు ఇంత మేలు చేసిన అధికారులకు ముఖ్యమంత్రికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు రైతులు.
ఇంతలో ఎలక్షన్ టైం రానే వచ్చింది. అంతా మంచి పని చేసిన రైతులకీ ఆ ముఖ్యమంత్రికి ఏమాత్రం ఊహించని అంతగా ఓటమిపాలై చవిచూశారు. కారణం రాజకీయ చరిత్ర మారాలి రాజ్యాంగం మార్పు రావాలి దేశ ప్రగతి ముందుకు పోవాలి అని మరింత బలంగా నమ్మి కొత్త ప్రభుత్వానికి నాంది పలికారు రైతులు.
అలా ఏ దేశమేగినా ఏదైనా జరిగినా నీ వెంటనే ఉంటాను అంటూ పలికాడు మీకోసమే ఉంటాను నీ వెంటే ఉంటాను నీతోనే ఉంటాను ఒక అన్న ఉంటాను తమ్ముడిలా ఉంటాను అంటూ ఏవేవో చెప్పాడు. రాజకీయ నాయకుడు అయ్యాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. మంచి వారు అనుకుంటున్నారు మంచి చేస్తారు అనుకున్నారు అనుభవం లేకపోయినా పర్వాలేదు మంచి చేస్తే చాలా అనుకున్నాము కానీ రైతుల నోట్లో మట్టి కొట్టి చూపించాడు.
ప్రజలారా ఓటు ఎంత విలువైందో ఇప్పటికైనా గ్రహించండి మీరు వేసే ఓటు పదిసార్లు ఆలోచించి ఓటు వేయండి ఈ నియోజకవర్గం యొక్క క్యాండెట్ మంచివాడు అని తెలిస్తే వారికి ఓటు వేయండి తప్పులేదు కానీ ఇటువంటి వాళ్లు మనకు పనికి రాని వాళ్లందరికీ ఓటు వేస్తే భవిష్యత్తు అస్తవ్యస్తం అవుతుంది దేశం వెనుకబడి పోతుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
If you want to ask me anything just ask here